దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 40,425 కరోనా పాజిటివ్ కేసులు, 681 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 27,497 కు చేరుకుంది. జూలై 20, సోమవారం ఉదయానికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,18,043 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్,ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా బాధితుల రికవరీ రేటు 62.62 శాతానికి పెరగగా, కరోనా మరణాల రేటు 2.46 శాతంగా ఉంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 20, ఉదయం 8 గంటల వరకు):
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 11,18,043
కొత్తగా నమోదైన కేసులు (జూలై 19 – జూలై 20 (8AM-8AM) : 40,425
నమోదైన మరణాలు : 681
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 7,00,087
యాక్టీవ్ కేసులు : 3,90,459
మొత్తం మరణాల సంఖ్య : 27,497
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu