ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 5041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 5041 కేసులతో కలిపి జూలై 19, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 49650 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 31,148 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో మరో 56 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వలన తూర్పుగోదావరి జిల్లాలో పది మంది, శ్రీకాకుళంలో ఎనిమిది మంది, కర్నూల్ లో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, కృష్ణాలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 642 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 22890 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 26118 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu