దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 70 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 74,383 పాజిటివ్ కేసులు నమోదవగా, 918 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 11, ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 70,53,806 కు, మరణాల సంఖ్య 1,08,334 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో 89,154 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 60,77,976 కు చేరుకుంది.
దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 86.2 శాతం గానూ, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 8,67,496 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu