భారత్ లో అక్టోబర్ 9, శుక్రవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 69,06,151 కు, మరణాల సంఖ్య 1,06,490 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 70,496 కరోనా పాజిటివ్ కేసులు, 964 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా 59 లక్షలు దాటింది. ఒకే రోజులో 78,365 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 59,06,069 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 85.5 శాతంగా నమోదైంది. కాగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 8,93,592 మంది చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో అక్టోబర్ 8 నాటికీ 8,46,34,680 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 11,68,705 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu