దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,112 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,46,880 కు చేరుకుంది. కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య 5,28,987 కు పెరిగింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 335, తమిళనాడులో 183, ఢిల్లీలో 86, కర్ణాటకలో 82, తెలంగాణలో 79 నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో 1,44,491 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారి పాజిటివిటీ రేటు 0.67 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 27, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 90,04,17,092
- అక్టోబర్ 26న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,44,491
- కొత్తగా నమోదైన కేసులు [అక్టోబర్ 26–అక్టోబర్ 27 (8AM-8AM)] : 1, 112
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,46,880
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 1,892
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,40,97,072
- కరోనా రికవరీ రేటు : 98.77 శాతం
- యాక్టీవ్ కేసులు : 20,821 (0.05 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 6
- మొత్తం మరణాల సంఖ్య : 5,28,987
- కరోనా మరణాల రేటు: 1.18 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE