దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. జూన్ 6, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 2,88,09,339 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,46,759 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా దేశంలో ప్రస్తుతం 14,77,799 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి 5 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
దేశంలో లక్షకుపైగా కరోనా యాక్టీవ్ కేసులు ఉన్న 5 రాష్ట్రాలివే:
- కర్ణాటక – 2,54,505
- తమిళనాడు – 2,44,289
- మహారాష్ట్ర – 1,85,527
- కేరళ – 1,60,996
- ఆంధ్రప్రదేశ్ – 1,23,426
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ