భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 46253 కేసులు, 514 మరణాలు నమోదయ్యాయి. నవంబర్ 4, బుధవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 83,13,876 కు, మరణాల సంఖ్య 1,23,611 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే 76 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. ఒకే రోజులో 53,357 మంది కోలుకోగా, రికవరీల మొత్తం సంఖ్య 76,56,478 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 92.09 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.49 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 4, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 83,13,876
- కొత్తగా నమోదైన కేసులు [నవంబర్ 3–నవంబర్ 4 (8AM-8AM)] : 46253
- నమోదైన మరణాలు : 514
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 76,56,478
- యాక్టీవ్ కేసులు : 5,33,787
- మొత్తం మరణాల సంఖ్య : 1,23,611
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ