దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. యాక్టీవ్ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 41,506 కేసులు, 895 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,37,222 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,08,040 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, ఒడిశా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్ గడ్ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 41,526 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,99,75,064 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.20 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.32 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (జూలై 10 8am–జూలై 11 8am):
- కేరళ – 14087
- మహారాష్ట్ర – 8296
- ఆంధ్రప్రదేశ్ – 2925
- తమిళనాడు – 2913
- అస్సాం – 2391
- ఒడిశా – 2334
- కర్ణాటక – 2162
- వెస్ట్ బెంగాల్ – 997
- తెలంగాణ – 704
- ఛత్తీస్ గడ్ – 359
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ