మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 14, బుధవారం నాడు 8602 కరోనా కేసులు, 170 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 61,81,247 దాటగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,26,390 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 6,067 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 59,44,801 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.17 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.04 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,06,764 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పుణేలో అత్యధికంగా 17389 యాక్టీవ్ కేసులు ఉండగా, థానేలో 16096, కొల్హాపూర్ లో 11784, ముంబయిలో 11088, సంగ్లీలో 10746 కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 4,46,09,276 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ