దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 150 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 72,382 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 142 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.20 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,84,917 కు చేరుకుంది. ఇక కరోనా వలన మరో మూడు మరణాలు (ఉత్తర్ ప్రదేశ్ లో 3) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,760కి పెరిగింది. అలాగే 107 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,52,258 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది
కాగా ప్రస్తుతం దేశంలో 1,899 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కేసులు కొద్దిగా ఎక్కువ నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 50 పైన కరోనా కేసులు నమోదవలేదు.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (ఫిబ్రవరి 18 (8am)–ఫిబ్రవరి 19 (8am)):
- కేరళ – 47
- కర్ణాటక – 34
- మహారాష్ట్ర – 27
- తమిళనాడు – 6
- తెలంగాణ – 6
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE