ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా 984 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,96,863 కు చేరుకుంది. ఇక కరోనా వలన చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 7203 కి పెరిగింది. గత 24 గంటల్లో 306 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,85,515 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4145 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ