ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1608 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 10, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,27,650 కు, మరణాల సంఖ్య 13,970 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,107 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,98,561 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,119 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1608):
- చిత్తూరు – 281
- నెల్లూరు – 261
- తూర్పుగోదావరి – 213
- కృష్ణా – 161
- పశ్చిమగోదావరి – 154
- గుంటూరు – 141
- కడప – 126
- ప్రకాశం – 114
- విశాఖపట్నం – 70
- అనంతపూర్ – 34
- శ్రీకాకుళం – 21
- కర్నూల్ – 18
- విజయనగరం – 14