ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా వైస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. “ఈ రోజు వచ్చిన కోవిడ్ ఫలితాల్లో నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చాలా ధైర్యంగా వున్నాను, నా యోగ క్షేమాలు తెల్సుకోవడానికి నాకు చాలా మంది కాంటాక్ట్ చేస్తున్నారు, అందరికి ధన్యవాదాలు, త్వరలోనే పూర్తిగా కోలుకుని మరలా ఎప్పటిలానే ప్రజల్లోకి వస్తానని” అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆర్టీ- పీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నానని, ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానని అంబటి రాంబాబు తెలియజేశారు.
ఈ రోజు వచ్చిన కోవిడ్ ఫలితాల్లో నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది
చాలా ధైర్యం గా వున్నాను, నా యోగ క్షేమాలు తెల్సుకోవడానికి నాకు చాలా మంది కాంటాక్ట్ చేస్తున్నారు, అందరికి ధన్యవాదాలు,
త్వరలోనే పూర్తిగా కోలుకుని మరలా ఎప్పటిలానే ప్రజల్లోకి వస్తాను. pic.twitter.com/u12NxudPNT
— Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) July 22, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu