దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 10,064 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో గత 7 నెలల్లోనే అతి తక్కువ రోజువారీ కరోనా కేసులు నమోదయినట్టయింది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 1,05,81,837 కు చేరుకుంది. కరోనాతో మరో 137 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,52,556 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే కోటి రెండు లక్షల 28 వేల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
కొత్తగా 17,411 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,02,28,753 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.66 శాతం గానూ, మరణాల రేటు 1.44 శాతంగా ఉంది. ప్రస్తుతం 2,00,528 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్ గడ్, కర్ణాటక రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 10,064 కేసులలో 71.76 శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ