దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మరోసారి 20 వేలకుపైగానే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 4,98,034 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 20,557 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 4.13 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,38,03,619 కు చేరుకుంది. అలాగే కొత్తగా మరో 40 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,388 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పంజాబ్, కేరళ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, అస్సాం, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 18,517 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,31,32,140 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.47 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 1,45,654 (0.33%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (జూలై 19 (8am)–జూలై 20 (8am)):
- మహారాష్ట్ర – 2279
- పశ్చిమబెంగాల్ – 2243
- తమిళనాడు – 2142
- పంజాబ్ – 1941
- కేరళ – 1857
- కర్ణాటక – 1151
- ఒడిశా – 945
- గుజరాత్ – 787
- అస్సాం – 755
- తెలంగాణ – 658
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY