భారత్ లో నవంబర్ 7, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84,62,080 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గత 35 రోజులుగా దేశంలో కొత్తగా నిర్థారణ అవుతున్న కరోనా పాజిటివ్ కేసులకంటే, కరోనా నుంచి కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24 గంటల్లో కూడా 50,356 కొత్త కేసులు నమోదు కాగా, 53,920 మంది కోలుకున్నారు. అలాగే అక్టోబర్ మొదటి వారంలో కొత్త కేసులు సగటు 73,000 ఉండగా, ఇప్పుడు 46,000 కు తగ్గింది.
మరోవైపు చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య తగ్గుదల బాటలో సాగుతోంది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం 6.11% మాత్రమే అనగా 5,16,632 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే దేశంలో కోలుకున్నవారి సంఖ్య 78,19,886 కి పెరగడంతో రికవరీ రేటు 92.41% కి చేరింది. రికవరీ విషయంలో జాతీయ సగటుతో పోల్చుకున్నప్పుడు 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోనే ఎక్కువశాతం మంది కోలుకుంటున్నట్టు నివేదికలో నమోదైంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ