దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15,510 కరోనా పాజిటివ్ కేసులు, 106 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,12,241 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,57,157 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,68,627 (1.52%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ వంటి 6 రాష్ట్రాలలోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెరిగాయి. ఇక మరో 11,288 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,07,86,457 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.07 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.41 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు:
కాగా గత 24 గంటల్లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అస్సాం, మణిపూర్, సిక్కిం, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, లక్షద్వీప్, మేఘాలయ, లద్దాఖ్, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (మార్చి 1, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 21,68,58,774
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,11,12,241
- కొత్తగా నమోదైన కేసులు [ఫిబ్రవరి 28–మార్చి1 (8AM-8AM)] : 15,510
- నమోదైన మరణాలు : 106
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,07,86,457
- యాక్టీవ్ కేసులు : 1,68,627
- మొత్తం మరణాల సంఖ్య : 1,57,157
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ