మహారాష్ట్ర రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా 2,922 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 79,07,631 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,47,868 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 1,392 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 77,44,905 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 14,858 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
కాగా తాజాగా అందిన జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల ప్రకారం పూణేకు చెందిన ఓ వ్యక్తికి BA.5 కరోనా వేరియంట్ నిర్ధారణ అయిందని తెలిపారు. మే 21న అతను ఇంగ్లాండ్ నుంచి వచ్చాడని, అప్పటికే అతను రెండు డోసుల కోవిషిల్డ్ కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకున్నాడని చెప్పారు. జూన్ 2న అతనికి స్వల్ప లక్షణాలతో కరోనా నిర్ధారణ కాగా, అయితే ఆ వ్యక్తి హోమ్ ఐసోలేషన్ లోనే కోలుకున్నాడని అన్నారు. అయితే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అనంతరం శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపగా BA.5 వేరియంట్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జూన్ 11, శనివారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 8,12,78,846
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 79,07,631
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 77,44,905
- కరోనా రికవరీ రేటు – 97.94%
- యాక్టీవ్ కేసులు – 14,858
- జూన్ 11న నమోదైన కేసులు – 2,922
- జూన్ 11న డిశ్చార్జ్ అయినవారు – 1,392
- జూన్ 11న నమోదైన మరణాలు – 1
- మొత్తం మరణాల సంఖ్య – 1,47,868
- కరోనా మరణాలు రేటు – 1.86%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY