దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. మూడు రోజులుగా లక్ష 50 వేలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,61,736 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన 1,26,789 కేసుల్లో 51,751 కేసులు ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఏప్రిల్ 13, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453 కు చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 879 మరణాలు నమోదుకావడంతో మరణాల సంఖ్య 1,71,058 కు చేరుకుంది.
దేశంలో 12 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 89.51 శాతం:
ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కేరళ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 12,64,698 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 97,168 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,22,53,697 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 89.51 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.25 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్ 12, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 25,92,07,108 కు చేరుకుంది. గత 24 గంటల్లో 14,00,122 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ