దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డారు. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు. “నా కరోనా పరీక్ష ఫలితం పాజిటివ్ గా వచ్చిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ఇటీవల నాతో సంప్రదించిన వారంతా దయచేసి కరోనా భద్రతా నియమాలను పాటించాలని అభ్యర్థిస్తున్నాను. మనమంతా కలిసికట్టుగా ఈ మహమ్మారిని గెలుస్తాము” అని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ