దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసులు కంటే వరుసగా పదమూడో రోజూ కూడా రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,11,298 కేసులు, 3847 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,69,093 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,15,235 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, అస్సాం, పంజాబ్, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 24,19,907 (8.84%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 2,83,135 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,46,33,951 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 90.01 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.15 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (మే 26 8am–మే 27 8am) :
- తమిళనాడు – 33764
- కేరళ – 28798
- కర్ణాటక – 26811
- మహారాష్ట్ర – 24752
- ఆంధ్రప్రదేశ్ – 18285
- వెస్ట్ బెంగాల్ – 16225
- ఒడిశా – 11623
- అస్సాం – 5699
- పంజాబ్ – 4004
- రాజస్థాన్ – 3886
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ