దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల నమోదులో కొద్దీ పెరుగుదల కన్పిస్తుంది. గత 24 గంటల్లో మొత్తం 97,266 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 268 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.28 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,86,879 కు చేరుకుంది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,772 గా ఉంది. కాగా మరో 164 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,53,668 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది
కాగా ప్రస్తుతం దేశంలో 2,439 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొద్దిగా ఎక్కువ నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా రోజువారీ కరోనా కేసులు 100 పైన నమోదవలేదు.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (మార్చి 1 (8am)–మార్చి 2 (8am)):
- కర్ణాటక – 74
- కేరళ – 67
- మహారాష్ట్ర – 32
- తెలంగాణ – 21
- తమిళనాడు – 16.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE