రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా బాధితులకు అందుతున్నచికిత్స, ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రుల్లో బెడ్స్ అందుబాటు, రెమెడీసీవర్ సహా ఇతర ఔషదాల లభ్యత, రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సహా కొత్తగా నమోదవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులపై కూడా కీలక సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అలాగే మే 12వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలుతున్న లాక్డౌన్ తీరుపై కూడా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ