దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 1,83,709 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 294 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.16 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,69,715 కు చేరుకుంది. అలాగే మరో 5 మరణాలు (కేరళలో 5 మరణాల సవరణ) నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,592 కి పెరిగింది. మరో 482 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,32,915 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
కాగా ప్రస్తుతం దేశంలో 6,209(0.01%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 100 పైన కరోనా కేసులు నమోదవలేదు.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (నవంబర్ 21 (8am)–నవంబర్ 22 (8am)):
- కేరళ – 94
- తమిళనాడు – 42
- కర్ణాటక – 36
- మహారాష్ట్ర – 29
- రాజస్థాన్ – 20
- గుజరాత్ – 15
- పశ్చిమబెంగాల్ – 11
- తెలంగాణ – 7
- పంజాబ్ – 7
- ఉత్తర్ ప్రదేశ్ – 5.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE