తెలంగాణలో రాష్ట్రంలో మరో 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 20, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 99,391 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 26,767 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో మొత్తం పరీక్షలు సంఖ్య 8,48,078 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 473, రంగారెడ్డి జిల్లాలో 202, మేడ్చల్ లో 170, వరంగల్ అర్బన్ లో 101, కరీంనగర్ లో 86, జగిత్యాలలో 81, ఖమ్మంలో 79, నిజామాబాద్ లో 69, నల్గొండలో 60, జోగులాంబ గద్వాల్ లో 55, కామారెడ్డిలో 55, సిద్దిపేటలో 49, మంచిర్యాలలో 40, సంగారెడ్డిలో 38, పెద్దపల్లిలో 35, రాజన్న సిరిసిల్లలో 29, మహబూబ్నగర్ లో 29, సూర్యాపేటలో 28, నాగర్కర్నూల్ లో 27, వరంగల్ రూరల్ లో 26, మహబూబాబాద్ లో 26, మెదక్ లో 24, జనగామ లో 22, భద్రాద్రి కొత్తగూడెంలో 21, వనపర్తి లో 21 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 20, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 8,48,078
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 99,391
- కొత్తగా నమోదైన కేసులు : 1967
- నమోదైన మరణాలు : 8
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 76,967
- కరోనా రికవరీ రేటు: 77.43%
- యాక్టీవ్ కేసులు: 21,687
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 15,332
- మొత్తం మరణాల సంఖ్య : 737
- కరోనా మరణాల రేటు: 0.74%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu