దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదవడంతో ఆగస్టు 16, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,25,513 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 417 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,31,642 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి.
దేశంలో 3 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.48 శాతం:
ఇక దేశంలో ప్రస్తుతం 3,81,947(1.19%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 35,909 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,14,11,924 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.48 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. ఇక ఆగస్టు 15, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 49,48,05,652 కు చేరుకుంది. ఆగస్టు 15న 11,81,212 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ