ఇండియా vs సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీస్ నిర్ణాయక మూడో టెస్ట్ లో టీమిండియా కీపర్ రిషభ్ పంత్ సెంచరీ సాధించాడు. దీంతో ఇండియా 198 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించటంలో సాయపడ్డాడు. పంత్ మినహా మిగిలిన బ్యాట్స్ మన్ ఎవరూ రాణించకపోవడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితం అయింది. రిషభ్ పంత్ 100* పరుగులతో భారత్ రెండో ఇన్నింగ్స్ చివరివరకు నాటౌట్ గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు.
దీంతో.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 101 పరుగులతో రోజుని ముగించింది. దక్షిణాఫ్రికా చేతిలో 8 వికెట్లు ఉండగా విజయానికి ఇంకా 111 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడిక భారత్ గెలిచి మ్యాచ్ తోపాటు సిరీస్ ను కూడా గెలుచుకోవాలంటే.. మన బౌలర్లు సత్తా చాటాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ