మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా మెప్పించింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు క్రిష్. కరోనా పరిస్థితుల్లో థియేటర్లలో దసరా కానుకగా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఒక వైవిధ్యభరిత చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
తాజాగా ఈ సినిమా స్టార్ మాలో ప్రసారమైంది. బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి టీఆర్పీ దక్కించుకుంది కొండపొలం. అర్బన్ ఏరియాలో 12.34 టీఆర్పీ రాగా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మొత్తం కలిపి 10.54 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో రేటింగ్ రాబట్టుకోవడం సినీ పండితులని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ