దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 52 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించారు. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా మొదటి 52 రోజుల్లోనే (ఆగస్టు 12 నాటికీ) 22.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించడం జరిగిందని తెలిపారు.
గత 24 గంటల్లోనే 44 లక్షలమందికి పైగా కరోనా వ్యాక్సిన్:
కాగా ఆగస్టు 12, గురువారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసులు 52 కోట్లు (52,36,71,019) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 44 లక్షలమందికి పైగా (44,19,627) వ్యాక్సిన్ డోసులను అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 60 ఏళ్లు వయసు దాటిన వారిలో 23.1%, 45-60 ఏళ్ల వయసు వారికి 32.5%, 18-44 ఏళ్ల వయసు వారికి 44.4% మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని తెలిపారు. అలాగే ఇప్పటికీ దేశంలో 18-44 సంవత్సరాల వయస్సు కేటగిరిలో 18,47,82,179 మంది లబ్ధిదారులు మొదటి డోసు మరియు 1,34,26,569 మంది రెండో డోసు కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ