నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలిచిన నోముల భగత్ కుమార్ ఆగస్టు 12, గురువారం నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నోముల భగత్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కుటుంబసభ్యులు పాల్గొని నోముల భగత్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ముందుగా గత ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై 18వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే నేడు నోముల భగత్ కుమార్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ