ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,563 కు చేరుకుంది. గత 24 గంటల్లో 40,448 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 175 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 31, కర్నూల్ లో 0, కృష్ణాలో 24, కడపలో 9, గుంటూరులో 15, చిత్తూరులో 40, అనంతపూర్ లో 7, నెల్లూరులో 5, ప్రకాశంలో 9, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 6, పశ్చిమగోదావరిలో 3 కేసులు నమోదయ్యాయి.
ఇక కరోనా వలన అనంతపూర్ మరియు చిత్తూరులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7182 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 132 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,83,113 కు చేరింది. అలాగే ప్రస్తుతం 1268 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మార్చి 13 నాటికీ ఏపీలో మొత్తం 1,44,89,098 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ