కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 12,288 కరోనా కేసులు, 141 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,63,695 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 25,952 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 15,808 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 46,18,408 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,18,744 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 16949 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 14577, కొల్లంలో 12010, కోజికోడ్ లో 11738, మలప్పురంలో 10110, త్రిస్సుర్ లో 9064, పాలక్కాడ్ లో 7873, పతనంతిట్టలో 7119 కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాటికి కేరళలో 3,59,72,962 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ