కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 20,452 కరోనా కేసులు, 114 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36,52,090 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 18,394 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 16,856 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 34,53,174 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,80,000 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక మలప్పురం జిల్లాలో అత్యధికంగా 31242 యాక్టీవ్ కేసులు ఉండగా, కోజికోడ్ లో 26800, ఎర్నాకులంలో 24413, పాలక్కాడ్ లో 16104, త్రిస్సుర్ లో 11905 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి కేరళలో 2,91,95,758 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ