కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,190 కరోనా కేసులు, 3 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,08,845 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 66,012 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 3,878 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 64,24,920 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 17,105 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 3027 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 2399, కొట్టాయంలో 1709, త్రిస్సుర్ లో 1443, ఇడుక్కిలో 1406, కొల్లంలో 1365, కోజికోడ్ లో 1331, మలప్పురంలో 900, అలపుజాలో 878 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి కేరళలో 4,61,25,111 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ