మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇటీవల పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 17, శనివారం కూడా 10259 పాజిటివ్ కేసులు, 250 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,86,321 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 41,965 కు పెరిగింది. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటికి 80,69,100 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (అక్టోబర్ 17, శనివారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 15,86,321
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 13,58,606
- యాక్టీవ్ కేసులు – 1,85,270
- అక్టోబర్ 17 న నమోదైన కేసులు – 10,259
- అక్టోబర్ 17 న డిశ్చార్జ్ అయినవారు – 14,238
- అక్టోబర్ 17 న నమోదైన మరణాల సంఖ్య – 250
- మొత్తం మరణాల సంఖ్య – 41,965
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu