తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్-2022 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ సోమవారం నాడు విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్, ప్రొఫెసర్ వి.వెంకట రమణ, టీఎస్ ఎడ్సెట్-2022 కన్వీనర్, ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, కో-కన్వీనర్ ప్రొఫెసర్ పి.శంకర్ విడుదల చేశారు. 2022-23 సంవత్సరానికి గానూ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఎడ్సెట్-2022 ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ 7 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఆలస్య రుసుము లేకుండా జూన్ 15 వరకు స్వీకరించనున్నారు. జులై 26, 27వ తేదీల్లో తెలంగాణలోని 17 రీజినల్ ఆన్లైన్ సెంటర్లతో పాటుగా, ఏపీలోని కర్నూల్, విజయవాడ వంటి 2 సెంటర్లలో ఎడ్సెట్-2022 పరీక్షను నిర్వహించనున్నారు. ఇక తెలంగాణలో 220 బీఈడీ కాలేజీల్లో మొత్తం 19,600 సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.
టీఎస్ ఎడ్సెట్-2022 పరీక్షషెడ్యూల్:
- నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 4
- ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఏప్రిల్ 7
- దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : జూన్ 15
- ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 1
- ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 15
- ఎడ్సెట్ పరీక్ష నిర్వహణ తేదీలు : జులై 26, 27
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ