కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,15,575 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 20,240 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 17.51 శాతంగా నమోదైంది.
అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 43,75,431 కు చేరుకుంది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ మరో 67 మంది మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,551 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 29,710 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 41,30,065 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 2,22,255 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ