కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 6,409 కరోనా కేసులు, 47 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,27,318 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 34,362 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 6,319 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 49,21,312 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 71,020 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక త్రిస్సుర్ జిల్లాలో అత్యధికంగా 10506 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురం 10108, ఎర్నాకులంలో 7898, కోజికోడ్ లో 7341, కొల్లంలో 6221, కొట్టాయంలో 5162 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి కేరళలో 3,84,60,040 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ