పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న కిరణ్ బేడీని మంగళవారం రాత్రి ఆ పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త నియామకం జరిగే వరకు కిరణ్ బేడీ స్థానంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
పుదుచ్చేరిలో గత నెల రోజులులోనే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో మెజార్టీ తగ్గడంతో సీఎం నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభ స్థితికి చేరుకుంది. అయితే గత కొంత కాలంగా పాలన విషయంలో అడ్డుతగులుతున్నారని సీఎంతో పాటుగా మంత్రులు కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తొలగించడం చర్చనీయాంశమైంది. మరోవైపు త్వరలో పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ