సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బుధవారం నాడు 10 వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా, 91.46 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. ఫలితాలను cbseresults.nic.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అలాగే పూర్తి ఫలితాలు అన్ని పాఠశాలలకు కూడా పంపబడ్డాయని తెలిపారు. పరీక్షల్లో పాసైన విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ 10వ తరగతి పెండింగ్ పరీక్షలను బోర్డు ఇటీవలే రద్దు చేసింది. పరీక్షలు రద్దు కావడంతో మునుపటి పరీక్షలు, ఇంటర్నల్ అస్సేస్మెంట్ ఆధారంగా సీబీఎస్ఈ బోర్డు ఈ పరీక్షల ఫలితాలను వెల్లడించింది.
Dear Students, Parents, and Teachers!@cbseindia29 has announced the results of Class X and can be accessed at https://t.co/U3MU3QfULs.
We congratulate you all for making this possible. I reiterate, student’s health & quality education are our priority.
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 15, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu