కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన నాలుగో విడత లాక్డౌన్ రేపటితో అనగా మే 31 వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను మరోసారి పొడిగించింది. దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ఈ రోజు ప్రకటించింది. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
లాక్డౌన్ 5.0 మార్గదర్శకాలు: ఫేజ్ 2
- పాఠశాలలు, కళాశాలలు, విద్యా శిక్షణ కోచింగ్ సంస్థలు మొదలైనవి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదించిన తరువాత తెరవబడతాయి. రాష్ట్రాలకే నిర్ణయాధికారం.
- విద్యా సంస్థల పునఃప్రారంభంపై జూలైలో నిర్ణయం తీసుకోవాలి.
- పాఠశాల ప్రారంభంపై ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంబంధిత మంత్రిత్వ శాఖలు / విభాగాలుతో సంప్రదించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటించేలా విధి విధానాలు/నియమాలను జారీ చేస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu