మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 24, శనివారం నాడు 2697 కరోనా కేసులు, 59 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,06,354 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 50,740 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 3,694 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,10,521 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.22 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.53 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం కేరళ (72,051) తర్వాత మహారాష్ట్ర (43,870) రాష్ట్రంలోనే ఎక్కువ యాక్టీవ్ కేసులు ఉన్నాయి. శనివారం నాటికి రాష్ట్రంలో 1,41,45,829 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ