మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 14, శనివారం నాడు కూడా 4237 కరోనా కేసులు, 105 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,44,698 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 45,914 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 2,707 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 16,12,314 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.04 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.6 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 85,503 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ