తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త అందించింది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనం మరో రూ.3000 పెంచుతున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ శనివారం నాడు ప్రకటించారు. ప్రస్తుతం వారి వేతనం రూ.14,500 ఉండగా, తాజా ప్రభుత్వ నిర్ణయంతో రూ.17,500 కు పెరగనుంది. 2014 లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి మూడు సార్లు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచారు. ముందుగా రూ.8,500 ఉన్న వేతనాన్ని 2015లో రూ.12,500 చేశారు. అనంతరం 2017 వ సంవత్సరంలో రూ.14,500 చేశారు. తాజాగా ప్రభుత్వం మరో రూ.3000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ