డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు నిరాశ ఎదురైంది. ఈ అవార్డు రేసులో మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ లతో పాటు అజాజ్ పటేల్ ఉన్నప్పటికీ.. అజాజ్నే అవార్డు వరించింది. పోయిన నెలలో ముంబై వేదికగా భారత్తో జరిగిన రెండో టెస్ట్లో ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్ల పడగొట్టిన అజాజ్.. జిమ్లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా అజాజ్ రికార్డు ప్రదర్శన చేశాడు.
కాగా, అవార్డు ప్రకటన సందర్భంగా ఐసీసీ ఓటింగ్ కమిటీ మెంబర్ జేపీ డుమిని మాట్లాడుతూ.. ఇదో అద్భుత ఘటన. ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీయడం మాములు విషయం కాదు. క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే ఫీట్ ఇది. అలంటి ఘనత అందుకున్న అజాజ్కు ఐసీసీ జ్యూరీతో పాటు అభిమానులు భారీ ఎత్తున ఓటింగ్ చేశారని, మరీ ముఖ్యంగా.. భారత అభిమానులు అజాజ్ పటేల్కు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారని పేర్కొన్నాడు. అజాజ్ సాధించిన ఫీట్ చాలా ప్రత్యేకమైందని, చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోతుందని డుమిని అన్నాడు. అజాజ్ అద్భుత ప్రదర్శనపై టీమిండియా ఆటగాళ్లతోపాటు, మాజీలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ