తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కోత్తగా సోమవారం ఒక్కరోజులోనే 1825 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 6,95,855 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరోకరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,043 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 97.26 శాతంకాగా, మరణాల రేటు 0.58 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 351 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,76,817 కు చేరుకుంది. ప్రస్తుతం 14,995 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. సోమవారం నాడు 70,697 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,01,94,585 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 8,11,246 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇంకా 12,948 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ