ఒడిశా రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్డౌన్ తరహా ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా మే 5వ తేది నుంచి మే 19 వరకు రెండువారాల పాటుగా లాక్డౌన్ ఆంక్షలు విధించారు. ఈ గడువు రేపటితో ముగియనుండడంతో ఆరోగ్య నిపుణులతో సంప్రదింపుల అనంతరం లాక్డౌన్ ఆంక్షలను జూన్ 1 ఉదయం 5 గంటల వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
ఇక వీకెండ్స్ లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు కఠినమైన ఆంక్షలు అమల్లో ఉంటాయని మరియు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు ఒడిశాలో ఇప్పటివరకు మొత్తం 6,33,302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,26,353 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,410 మంది మరణించారు. ప్రస్తుతం 1,04,539 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ