ఒలింపిక్ పతక విజేత, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక డైమెండ్ లీగ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ అథ్లెట్గా ఘనత సాధించాడు. గురువారం జరిగిన ఫైనల్లో నీరజ్ చోప్రా మొదటి ప్రయత్నంలో త్రోను ఫౌల్గా ప్రారంభించినా, ఆ తర్వాత పుంజుకుని రెండో ప్రయత్నంలో జావెలిన్ను 88.44 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో డైమెండ్ లీగ్ టైటిల్ను చేజిక్కించుకున్న తొలి ఇండియన్గా చరిత్ర సృష్టించాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకడ్ 86.94 మీటర్ల దూరం విసిరి రెండవ స్థానంలో నిలవగా, జర్మనీ ఆటగాడు వెబర్ జూలియన్ 83.73 మీటర్ల మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఇక టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన 24 ఏళ్ల నీరజ్ చోప్రా ఇటీవలే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. తాజాగా డైమండ్ లీగ్లో ఏకంగా చాంపియన్గా నిలిచాడు. కాగా నీరజ్ సాధించిన విజయం పట్ల అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసినది. ఇంకా పలువురు ప్రముఖులు, మాజీ క్రీడాకారులు చోప్రాకు అభినందనలు తెలుపుతున్నారు.
Golds,Silvers done, he gifts a 24-carat Diamond 💎 this time to the nation 🇮🇳🤩
Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw.
FIRST INDIAN🇮🇳 AGAIN🫵🏻#indianathletics 🔝
X-*88.44*💎-86.11-87.00-6T😀 pic.twitter.com/k96w2H3An3
— Athletics Federation of India (@afiindia) September 8, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ