ప్రముఖ అగ్ర కథానాయకుడు, సూపర్స్టార్ రజనీకాంత్ ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న ఆయన బుధవారం నాడు తన సతీమణితో కలిసి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ మేరకు రజనీకాంత్ ట్వీట్ చేశారు. “గౌరవనీయులైన రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రిని కలవడం మరియు అభినందించడం చాలా ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.
మరోవైపు సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అనంతరం రజనీకాంత్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “నన్ను హృదయపూర్వకంగా అభినందించిన రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, అన్ని శాఖల మిత్రులకు, అభిమానులకు మరియు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ