పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ‘పక్కా’ ఇళ్లను పూర్తి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. ఈ ఇళ్ళు మహిళా సాధికారతకు చిహ్నంగా కూడా మారాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు అందించాలనేది మా సంకల్పం, దీనిని సాకారం చేసేందుకు ఒక ముఖ్యమైన అడుగును మేము వేశామని ప్రధాని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతోనే మూడు కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం సాధ్యమైంది. మౌలిక వసతులతో కూడిన ఈ ఇళ్లు నేడు మన దేశ మహిళలకు ఎంతో గర్వకారణం కానున్నాయని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.
देश के हर गरीब को पक्का मकान देने के संकल्प में हमने एक अहम पड़ाव तय कर लिया है। जन-जन की भागीदारी से ही तीन करोड़ से ज्यादा घरों का निर्माण संभव हो पाया है। मूलभूत सुविधाओं से युक्त ये घर आज महिला सशक्तिकरण का प्रतीक भी बन चुके हैं। pic.twitter.com/6jmMcMs21J
— Narendra Modi (@narendramodi) April 8, 2022
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద 2.52 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.95 లక్షల కోట్లు మంజూరు చేసింది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) కింద ఇప్పటివరకు 58 లక్షల ఇళ్లను నిర్మించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.18 లక్షల కోట్లు మంజూరు చేసింది. కాగా ఈ పథకం కింద నిర్మిస్తున్న ప్రతి ఇంటికి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్, నీటి కనెక్షన్ మరియు విద్యుత్ సహా ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పిస్తుండటం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ